Ammaku Aksharamala | అమ్మకు అక్షరమాల
#MPPSSINGITHAM
అమ్మకు అక్షరమాల...
-కొత్త కార్యానికి కలెక్టర్ కణ్ణన్ శ్రీకారం
-సెలవుల్లో పిల్లలు అమ్మలకు అక్షరాలు నేర్పించాలి
-50వేల మంది తల్లులకు చదువు నేర్పించడమే లక్ష్యం
-విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం
అమ్మ అనునిత్యం పిల్లల కోసం పరితపిస్తుంది... ఉదయం లేచింది మొదలు ప్రతి నిమిషం పనిలోనే.. పిల్లలను తయారు చేసి బడికి పంపి తిరిగి ఇంటికి చేరే వరకు వారి మీదే ధ్యాస. స్కూల్లో ఎలా ఉన్నారో..? బాగా చదువుతున్నారా..? వారిని మంచి ప్రయోజకులను చేయాలని ఆరాటం. అనుక్షణం తమ కోసం తపన పడుతున్న అమ్మకు సేవచేసే అవకాశం వచ్చింది. సెలవు రోజుల్లో చేతనైనంత చేదోడుగా ఉండేందుకు పిల్లలు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ వేసవి సెలవుల్లో బడి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఆ కార్యమే పిల్లలు అమ్మకు చదువు నేర్పించడం. అఆ..లతో కూడిన వర్ణమాల నేర్పించి.. కనీసం తన పేరును రాసుకునే విధంగా అమ్మను తీర్చిదిద్దడం.. ఈ సెలవుల్లో జిల్లాలోని 50వేల మంది నిరక్షరాస్యులైన అమ్మలకు చదువు నేర్పించడమే పిల్లలు లక్ష్యంగా పెట్టుకోవాలని కలెక్టర్ పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. కార్యక్రమ విధివిధానాలు తుదిదశకు వచ్చాయి. అంటే... సెలవుల వేళ.. అమ్మకు అక్షరమాల వేయడానికి విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉన్నదన్నమాట....
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో వివిధ తరగతుల్లో కలిపి మొత్తం 1.50 లక్షలకు పైగా విద్యార్ధులు చదువుకుంటున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటివద్దే ఉంటారని గుర్తించిన కలెక్టర్ వారి కోసం అమ్మకు చదువునేర్పించే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో చర్చించారు. ఇప్పటి నుంచే పాఠశాలలో ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి విద్యార్థి రోజూ కొంత సమయాన్ని అమ్మకోసం కేటాయించి వర్ణమాల, తమ పేర్లు నేర్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలు చదువు నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. రోజు నాలుగు అక్షరాల చొప్పున మహిళలు ప్రత్యేకంగా తయారు చేయించిన పత్రాలపై దిద్దిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయ వంతంగా కొనసాగుతుండడంతో ఇప్పుడు విద్యార్థులచే అమ్మలకు చదువు నేర్పించాలని సంకల్పించారు.
సెలవులకు ముందే ఆయా గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంపై విద్యార్థులకు దిశానిర్థేశం చేయనున్నారు. ఈ మంచి కార్యానికి ప్రత్యేక పేరు పెట్టాలని కూడా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ భావిస్తున్నారు. అమ్మకు అఆలు... అమ్మకు చదువు... అమ్మకు వర్ణమాల... వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో కార్యక్రమ విధివిధానాలను కలెక్టర్ ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందు విద్యార్థులకు మాత్రం ఈ అంశంపై అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తంగా పిల్లలు అమ్మకు చదువు నేర్పించే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్కు గుర్తింపు తీసుకురానున్నదని చెప్పుకోవచ్చు.
అక్షరాలు నేర్పించడం పిల్లల బాధ్యత...
పిల్లలే లోకంగా జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు అలాంటి అమ్మలకు పిల్లలు చదువు నేర్పించడం బాధ్యతగా తీసుకోవాలి. వేసవి సెలవుల్లో రోజు కొంత సమయాన్ని అమ్మ కోసం కేటాయించాలి. వర్ణమాల, పేరు రాయడం నేర్పించాలి. మా అమ్మకు నేను చదువు నేర్పించాననే గొప్ప అనుభూతిని పిల్లలు జీవితాంతం గుర్తించుకుంటారు. తనకు దక్కిన అదృష్టంగా కూడా విద్యార్థులు భావించాలి. 50 వేల మంది వరకు చదువుకునే పిల్లల అమ్మలకు చదువు రాదని గుర్తించాం. వారికి ఈ వేసవి సెలవుల్లో అక్షరాలు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమ్మలు ఉత్సాహంగా చదువు నేర్చుకోవాలి. నా కొడుకు, కూతురు దగ్గర చదువు నేర్చుకున్నానని అమ్మకు, అమ్మకు చదువు నేర్పించామని పిల్లలూ జీవితకాలం గుర్తుంచుకుంటారు.
-మాణిక్కరాజ్ కణ్ణన్, కలెక్టర్
"Ammaku Aksharamala" programme is going to be conducted from tomorrow (17.04.2017) by the Dist Collector Sangareddy. Therefore, all the MEOs are instructed to monitor the programme at concerned schools and make it successful. (communicate the CDs/Formats to HMs)
High schools only
-- DEO Sangareddy
High schools only
-- DEO Sangareddy
Ammaku Aksharamala | అమ్మకు అక్షరమాల
ReplyDeletehttp://mppssingitham.blogspot.com/2017/04/ammaku-aksharamala.html